తెలంగాణ: సెక్రటేరియట్లో రెండు మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన
- November 25, 2021
హైదరాబాద్: తెలంగాణ నూతన సెక్రటేరియట్లో రెండు మసీదుల నిర్మాణానికి గురువారం నాడు శంకుస్థాపన జరిగింది.హైదరాబాద్ లోని నిజామియా యునివర్సిటీ వైస్ –చాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ శంకుస్థాపన చేయగా,రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహ్మూద్ అలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.జామియా నిజామియా షేక్ జామియా, ముఫ్తీ గియాస్లతో పాటు శాసన సబ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ,అహ్మద్ పాషా ఖాద్రి ,దానం నాగేందర్ ,ఎంఎల్ సి ఫరూక్ హుస్సేన్ లు పాల్గొన్నారు .ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు సచివాలయంలోని రెండు మసీదులకు శంకుస్థాపన జరిగిందని,అద్భుతమైన శైలిలో మసీదులు నిర్మిస్తామన్నారు.
ఇదివరకే రుపొందించబడిన టర్కీ మసీదుల నమూనాల ప్రకారం మసీదులను నిర్మిస్తామని హోం మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ అన్ని వసతులతో మసీదులు నిర్మిస్తామని కేసీఆర్ ముస్లింలకు హామీ ఇచ్చారని, ఆ మేరకే ఈ రోజు శంకుస్థాపన జరిగిందని మంత్రి తెలిపారు. ఇదివరకు పాత సచివాలయంలో మసీదులు 700 గజాల విస్తీర్ణంలో ఉండేవని, అయితే పెద్ద సంఖ్యలో ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా రెండు మసీదులకు కేసీఆర్ 1500 గజాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. పెద్ద మసీదులో ఇమామ్కు ఇల్లు కూడా నిర్మిస్తున్నామని, ఆయన అక్కడే ఉండి సమయానికి ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉందని మంత్రి తెలిపారు. నిర్మించబోయే పెద్ద మసీదులో మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయన్నారు.
మసీదుల నిర్మాణానికి మొత్తం రూ. 2.9 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కేసీఆర్ లౌకికవాది అని, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు.ప్రజల సౌకర్యార్థం ఐదురోజుల నమాజులు, శుక్రవారం నమాజులు, తరావీహ్, ఈద్ ప్రార్థనలు మసీదుల్లో చేసేలా నిర్మాణం ఉంటుందన్నారు.తెలంగాణ సచివాలయంలోని రెండు మసీదులకు దేశంలోనే విశిష్టమైన, ఆదర్శవంతమైన స్థానం ఉంటుందని మంత్రి అన్నారు.ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ సెక్రటేరియట్లోనూ ఇలాంటి మసీదులు లేవు అని హోం మంత్రి తెలిపారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ ముహమ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







