అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహించడం తెలుగు జాతికి గొప్ప ప్రేరణ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

- December 03, 2021 , by Maagulf
అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహించడం తెలుగు జాతికి గొప్ప ప్రేరణ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూ ఢిల్లీ: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్  2022 జనవరి 6,7,8 న భీమవరం వెస్ట్ బెర్రీ  హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల ద్వారా" తెలుగు భాషా వైభవానికి  కృషి చేయడం అభినందనీయమని, ఈ సంబరాలు తెలుగు జాతికి ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నానని,ఈ సంబరాల ముగింపు సభ 8వ తారీఖు జనవరి 2022 న పాల్గొంటానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు కిషన్ రెడ్డి  తెలిపారని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.ఢిల్లీలో వారి కార్యాలయంలో వారిని కలసి ఆహ్వానలేఖ అందజేసినట్లు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.కిషన్ రెడ్డి ని కలసి ఆహ్వానించిన వారిలో సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com