ఒమన్ లో అజీజ్ అల్ సౌద్.. ఒమన్-సౌదీ సహకారానికి కొత్త శకం
- December 06, 2021
ఒమన్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, డిఫెన్స్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మనిస్టర్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సోమవారం ఒమన్ సుల్తానేట్ను సందర్శించనున్నారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను ఈ పర్యటన పెంచుతుందని రాయల్ కోర్ట్ దివాన్ ప్రకటించింది. ఈ ఏడాది జులైలో సౌదీ పర్యటన సందర్భంగా సౌదీ అరేబియా మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, అతని సోదరుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్న పలు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఈ పర్యటనకు వచ్చినట్లు పేర్కొంది. సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్, సౌదీ అరేబియా అన్ని రంగాలలో ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సహకారాన్ని కొత్త దశకు తీసుకుపోనున్నాయని తెలిపింది. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఒమన్ సుల్తానేట్కు సందర్శన గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) చైర్మన్ రిధా బిన్ జుమా అల్ సలేహ్ అన్నారు. ఒమన్ విజన్ 2040, సౌదీ విజన్ 2030లను ముందుకు తీసుకెళ్లడంతో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ పర్యటన తోడ్పడుతుందన్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







