అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు...
- December 09, 2021న్యూ ఢిల్లీ: కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది.అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఏ పునరాలోచనలో పడింది.కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందే భారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు.
ఆ తరువాత ఎయిర్ బబుల్ ఒప్పందం కింద 32 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతున్నారు.పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ సర్వీసులు నడుస్తున్నాయి.డిసెంబర్ 17 నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానాలు నడపాలని అనుకున్నా ఒమిక్రాన్ కేసుల కారణంగా ఆ నిర్ణయాన్ని డీజీసీఏ వెనక్కి తీసుకుంది.జనవరి 31, 2022 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారమే విమాన సర్వీసులు సడుస్తాయని ప్రకటించింది.
తాజా వార్తలు
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు