112 మంది భారతీయులకు పాక్ వీసా
- December 15, 2021
న్యూఢిల్లీ : పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాలను సందర్శించేందుకు 112 మంది భారతీయులకు పాక్ మంగళవారం వీసాలు జారీ చేసింది.
ఈ నెల 17 నుంచి 23 వరకు కటాస్ ఆలయాల సముదాయం సందర్శించేందుకు వీసాలు జారీ చేసినట్లు న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ తెలిపింది. కటాస్ ఆలయాలు చెరువు చుట్టూ ఉండగా.. వాటిని సందర్శించడాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తున్నారు.
1974లో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు మతపరమైన ప్రదేశాలను సందర్శించేందుకు వీసాలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ భారతీయ యాత్రికుల కోసం వీసాలు ఇస్తున్నది. ఈ నెల 4న సింధ్లోని షాదానీ దర్బార్ హయత్ పిటాఫీలో సద్గురు సంత్ షాదరామ్ సాహిబ్ 313వ జయంతి వేడులకు హాజరయ్యేందుకు 136 మందికి పాక్ హైకమిషన్ వీసాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







