ఏపీ కరోనా అప్డేట్

- December 15, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు పెరుగుతూ.. తాగుతూ వస్తున్నాయి.అయితే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,071 శాంపిల్స్‌ పరీక్షించగా.. 163 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.ఒక్క కోవిడ్‌ బాధితుడు మృతి చెందారు.ఇదే సమయంలో 162 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,08,62,705 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,75,271 కు పెరిగింది.ఇక, రికవరీ కేసులు 20,58,979 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14,471 కు చేరిందని.. ప్రస్తుతం 1,821 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com