మనీలాండరింగ్కు పాల్పడిన విదేశీయులపై చర్యలు
- December 26, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయులపై విచారణ మెకానిజాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. మనీలాండరింగ్ నిరోధక యూనిట్ యాక్టింగ్ సభ్యుడు అబ్దుల్లా అల్-జహ్రానీ మాట్లాడుతూ.. మనీలాండరింగ్ నేరంతో ఆరోపణలు ఎదుర్కొని సౌదీని విడిచివెళ్లిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారిని అప్పగించాలని ఆయా దేశాలకు అంతర్జాతీయ వ్యవస్థల ద్వారా నోటీసులు పంపిస్తామన్నారు. నిందితులను తిరిగి సౌదీ అరేబియాకు రప్పించి విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక న్యాయస్థానాలలో మనీలాండరింగ్కు పాల్పడిన వారిపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







