ప్రవాసులను పెళ్లాడిన కువైట్ మహిళల కోసం కొత్త సర్వీసులు
- December 26, 2021
కువైట్ సిటీ: ప్రవాసులను పెళ్లాడిన కువైట్ మహిళల కోసం అక్కడి ప్రభుత్వం కొత్త సర్వీసులను తీసుకొచ్చింది.దీనికోసం ప్రత్యేకంగా సిటిజెన్ సర్వీస్ సెంటర్లను తెరిచింది. ఎవరైతే కువైటీ మహిళలు ప్రవాసులను పెళ్లి చేసుకున్నారో వారు తప్పకుండా ఈ కేంద్రాలకు వెళ్లి తమ పూర్తి వివరాలను అందించాలి.భర్తకు సంబంధించిన ప్రతి లావాదేవీల వివరాలు, పిల్లలు ఇలా అన్ని వివరాలను ఇవ్వాలి.ఇలా ఒకసారి డిజిటలైజ్గా వివరాలను నమోదు చేసుకుంటే.. ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు నేరుగా సంబంధిత వ్యక్తులు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ వివరాలతో పనులు చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వశాఖలోని రెసిడెన్సీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్సెక్రెటరీ మేజర్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్ తెలిపారు. అల్ సలామ్ ప్రాంతంలో తొలి సిటిజెన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించారు. సిటిజెన్ సర్వీస్ సెంటర్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ ఖదేర్ షాబాన్తో అన్వర్ అల్ బర్జాస్ ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోని దేశంలోని మిగతా కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రవాసులను పరిణయమాడిన కువైటీ మహిళలు సర్వీస్ సెంటర్స్కు వచ్చి సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







