అబుధాబి: 2,794 మంది కార్మికులకు బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశం
- December 26, 2021
అబుధాబి: 4 కంపెనీల్లోని 2,794 మంది కార్మికులకు 40 మిలియన్ దిర్హాలు బకాయిల చెల్లింపును అబుధాబి లేబర్ కోర్టు క్లియర్ చేసింది. క్లెయిమ్ల నమోదును సులభతరం చేయడంతోపాటు కేసుల విచారణకు అబుధాబి న్యాయ శాఖ (ADJD) మొబైల్ లేబర్ కోర్టును ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా కార్మికులు ఉండే చోటుకు వెళ్లి వారి హక్కులను కాపాడటంతోపాటు వారికి సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుంది. రికార్డు సమయంలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన యంత్రాంగాన్ని అవలంబించామని అబుధాబి లేబర్ కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి, అబుధాబి న్యాయ శాఖ ఛైర్మన్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై కార్మికుల్లో విశ్వాసాన్ని బలపరిచే విధంగా లేబర్ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







