అబుధాబి: 2,794 మంది కార్మికులకు బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశం
- December 26, 2021
అబుధాబి: 4 కంపెనీల్లోని 2,794 మంది కార్మికులకు 40 మిలియన్ దిర్హాలు బకాయిల చెల్లింపును అబుధాబి లేబర్ కోర్టు క్లియర్ చేసింది. క్లెయిమ్ల నమోదును సులభతరం చేయడంతోపాటు కేసుల విచారణకు అబుధాబి న్యాయ శాఖ (ADJD) మొబైల్ లేబర్ కోర్టును ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా కార్మికులు ఉండే చోటుకు వెళ్లి వారి హక్కులను కాపాడటంతోపాటు వారికి సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుంది. రికార్డు సమయంలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన యంత్రాంగాన్ని అవలంబించామని అబుధాబి లేబర్ కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి, అబుధాబి న్యాయ శాఖ ఛైర్మన్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై కార్మికుల్లో విశ్వాసాన్ని బలపరిచే విధంగా లేబర్ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!