దుబాయ్లో శని, ఆదివారాల్లో పెయిడ్ పార్కింగ్
- December 27, 2021
దుబాయ్: యూఏఈలో నాలుగున్నర రోజుల వర్క్ వీక్గా మారిన తర్వాత కూడా దుబాయ్లో పెయిడ్ పార్కింగ్ కొనసాగనుంది.ఈ వీకెండ్ శని, ఆదివారాల్లో పెయిడ్ పార్కింగ్ సర్వీస్ అమల్లో ఉండనుంది. అయితే ప్రభుత్వం నోటీస్ ఇచ్చే వరకు శుక్రవారాలు, ప్రభుత్వ సెలవు దినాలలో ఉచిత పార్కింగ్ సేవలు కొనసాగుతాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. మెట్రో, ట్రామ్, వెహికిల్ టెస్టింగ్ సెంటర్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసివేత కోసం RTA కొత్త పని వేళలను ప్రకటించింది. కొత్త సమయాలు జనవరి 3(సోమవారం), 2022 నుండి అమలులోకి వస్తాయి.
వాహన పరీక్ష కేంద్రాలు
సాంకేతిక కేంద్రాలు ఆదివారం నుండి గురువారం వరకు వారం పాటు తెరిచి ఉంటాయి. శుక్రవారం 4pm నుండి 9pm వరకు పని చేస్తాయి. శనివారం ప్రభుత్వ సెలవుదినం.
దుబాయ్ మెట్రో
రెడ్ , గ్రీన్ లైన్లు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి 1.15 వరకు పని చేస్తాయి. శుక్రవారం, శనివారాల్లో మెట్రో లైన్లు ఉదయం 5 నుండి 2.15 వరకు పనిచేస్తాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి తెల్లవారుజామున 1.15 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
దుబాయ్ ట్రామ్
సోమవారం నుండి శనివారం వరకు సర్వీస్ వేళలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటాయి. ఆదివారం ఉదయం 9 నుండి 1 గంటల వరకు సేవలు అందిస్తాయి.
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసివేత
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఫిబ్రవరి 2, 2022 నుండి శనివారం రాత్రి 10 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు.
కస్టమర్ సర్వీస్ సెంటర్లు
సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 7.30 వరకు తెరిచి ఉంటాయి. శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.. శని, ఆదివారాల్లో బంద్ ఉంటాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









