ఒమన్ 47 రోజుల తర్వాత కోవిడ్ మరణం

- December 27, 2021 , by Maagulf
ఒమన్ 47 రోజుల తర్వాత కోవిడ్ మరణం

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో 47 రోజుల తర్వాత COVID-19 కారణంగా తొలి మరణం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్‌లో చివరి మరణం నవంబర్ 8, 2021 సోమవారం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్‌లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,114కి చేరుకుంది. నవంబర్ 2021 లో రెండు మరణాలు నమోదు కాగా.. అక్టోబర్ 2021లో 15 మరణాలు నమోదు అయ్యాయి. ఒమన్ లో గత మూడు రోజుల్లో 121 కొత్త వైరస్ కేసులు నమోదు అయ్యాయి. గురువారం 43, శుక్రవారం 31, శనివారం 47 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 305,105 కు చేరింది. కాగా రికవరీ రేటు 98.4 శాతంగా నమోదైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com