ఒమిక్రాన్ ను లైట్ తీసుకోవద్దు.. WHO హెచ్చరిక..!
- January 06, 2022
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ఒమిక్రాన్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పుడు భారతదేశంలోనూ ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య లక్షవరకు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదని అంటోంది. సాధారణ వ్యాధిగా భావించరాదని హెచ్చరిస్తోంది. లేదంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకారిగా మారే ముప్పు ఉందని WHO టెక్నికల్ లీడ్ మరియా వాన్ కేర్ఖోవ్ హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువ అయినప్పటికీ అది తేలికపాటి వ్యాధి మాత్రం కాదన్నారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు మాత్రం అసలే కాదన్నారు. వృద్ధులు ఈ వేరియంట్ బారినపడితే తీవ్ర అనారోగ్య పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. ఒమిక్రాన్ కేసులతో ఆస్పత్రులన్నీ నిండిపోయే ప్రమాదం ఉందని కేర్ఖోవ్ హెచ్చరించారు.
ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉంటుంది కదాని లైటుగా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరిస్తోంది. మరోవైపు.. డెల్టా వేరియెంట్తో పోలిస్తే.. ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఒమిక్రాన్ వైరస్ తీవ్రత తక్కువే.. చాలా తక్కువ మంది మాత్రమే తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఒమిక్రాన్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా అనీ నిర్లక్ష్యంగా కూడా ఉండరాదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









