మొదలైన థర్డ్ వేవ్..అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ హెచ్చరిక
- January 06, 2022
తెలంగాణ: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటికే భారత్లో థర్డ్ వేవ్ మొదలైపోయింది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేవారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అమెరికాలో నిన్నటి రోజు పది లక్షల కేసులు నమోదయ్యాయి, యూకేలో మొత్తం మూడు లక్షల కేసులు వెలుచూశాయి.. మనదేశంలో కూడా మూడో వేవ్ స్టార్ట్ అయ్యిందన్నారు.. అందులో భాగంగానే నిన్న ఒక్కరోజే 50 వేల కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు..
దేశంలో 15 రాష్టాల్లో మూడోవేవ్ స్టార్ట్ అయ్యిందన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఢిల్లీలో ఒక్క రోజే 10 వేల కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణలో 1600 కేసులు నిన్న నమోదు అయ్యాయి.. రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డిల్లో కేసులు పెరిగాయన్నారు.. దేశంలో 2 నుంచి 6 రేట్లు కేసులు పెరిగాయి.. తెలంగాణలో నాలుగు రేట్లు కేసులు పెరిగాయన్న ఆయన.. తీవ్రమైన సమస్యలు తలెత్తకుండా ఉండటం మంచి పరిణామం అన్నారు.. ఇక, రాష్ట్రంలో బెడ్ల కొరత లేదు.. ఇప్పుడు కోవిడ్ బారిన పడినవాల్లు ఐదు రోజుల్లో కోలుకుంటున్నారన్న ఆయన.. మరోవైపు 95 శాతం మంది పాజిటివ్ కేసుల్లో లక్షణాలు ఉండటం లేదన్నారు.. ఇక, ఒమిక్రాన్తో పాటు డెల్టా వేరియంట్ ఉంది.. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. కాగా, భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 325 మంది కోవిడ్ బాధితులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









