మొదలైన థర్డ్ వేవ్..అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ హెచ్చరిక
- January 06, 2022
తెలంగాణ: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటికే భారత్లో థర్డ్ వేవ్ మొదలైపోయింది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేవారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అమెరికాలో నిన్నటి రోజు పది లక్షల కేసులు నమోదయ్యాయి, యూకేలో మొత్తం మూడు లక్షల కేసులు వెలుచూశాయి.. మనదేశంలో కూడా మూడో వేవ్ స్టార్ట్ అయ్యిందన్నారు.. అందులో భాగంగానే నిన్న ఒక్కరోజే 50 వేల కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు..
దేశంలో 15 రాష్టాల్లో మూడోవేవ్ స్టార్ట్ అయ్యిందన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఢిల్లీలో ఒక్క రోజే 10 వేల కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణలో 1600 కేసులు నిన్న నమోదు అయ్యాయి.. రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డిల్లో కేసులు పెరిగాయన్నారు.. దేశంలో 2 నుంచి 6 రేట్లు కేసులు పెరిగాయి.. తెలంగాణలో నాలుగు రేట్లు కేసులు పెరిగాయన్న ఆయన.. తీవ్రమైన సమస్యలు తలెత్తకుండా ఉండటం మంచి పరిణామం అన్నారు.. ఇక, రాష్ట్రంలో బెడ్ల కొరత లేదు.. ఇప్పుడు కోవిడ్ బారిన పడినవాల్లు ఐదు రోజుల్లో కోలుకుంటున్నారన్న ఆయన.. మరోవైపు 95 శాతం మంది పాజిటివ్ కేసుల్లో లక్షణాలు ఉండటం లేదన్నారు.. ఇక, ఒమిక్రాన్తో పాటు డెల్టా వేరియంట్ ఉంది.. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. కాగా, భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 325 మంది కోవిడ్ బాధితులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







