ఏపీ కరోనా అప్డేట్
- February 03, 2022
అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య భారీగా పెరగడం పెద్ద ఉపశమనం ఇస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 4వేల 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,93,171కి చేరింది.
ఒక్క రోజులో 11వేల 729 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీల సంఖ్య 21,85,042 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 93వేల 488 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 30వేల 578 కరోనా టెస్టులు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,25,71,365 కోవిడ్ టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ను విడుదల చేసింది.
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గినా.. ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో మరో 10మంది చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 641కి పెరిగింది. బుధవారం 5వేల 983 కరోనా కేసులు నమోదవగా.. శుక్రవారం ఆ సంఖ్య భారీగా తగ్గింది.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









