ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

- February 12, 2022 , by Maagulf
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 896 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో ఆరుగురు కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో ఒక్కరోజులో 8వేల 849 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 454 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో 24,066 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. శుక్రవారంతో (1,166) పోలిస్తే శనివారం కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో అనంతపురం జిల్లాలో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 694కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,28,09,000 కరోనా టెస్టులు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com