యూఏఈలో భిక్షాటన చేస్తే.. 3నెలల జైలు..
- February 13, 2022
యూఏఈ: యూఏఈలో భిక్షాటన చేసేవారి పై కఠిన చర్యలకు ఉపక్రమించింది.ఇక పై ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే మూడు నెలల జైలుతో పాటు 5వేల దిర్హమ్స్ జరిమానా ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా కీలక ప్రకటన చేసింది.భిక్షాటనకు జరిమానా పై అవగాహన కల్పించడం కోసం ఫెడరల్ డిక్రీ-లా నం.31 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 475లో నేరాలు, జరిమానాల చట్టానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫిబ్రవరి 11న తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్లలో వివరాలను పోస్ట్ చేసింది. “ఏదైనా రూపంలో లేదా పద్ధతిలో భౌతిక లేదా సాధకమైన ప్రయోజనాన్ని పొందేందుకు యాచిస్తూ పట్టుబడితే మూడు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.5,000 దిర్హమ్స్కు తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుంది.” అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన పోస్టులో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







