26వ మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- February 24, 2022
మస్కట్: మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ మరియు యూత్ సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్, 26వ ఎడిషన్ మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ 2022 (ఎంఐబిఎఫ్)ని అధికారికంగా ప్రారంభించారు. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాజర్ అల్ హర్రాసి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది. మార్చి 5 వరకు ఇది కొనసాగుతుంది. 27 దేశాలకు చెందిన 715 ప్రచురణ సంస్థలు, 361,230 రకాల పుస్తకాల్ని పది రోజులపాటు సాగే బుక్ ఫెయిర్లో ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. 114 వరకు కల్చరల్ యాక్టివిటీస్, 85 పిల్లల యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









