గన్నవరం నుండి బెంగళూరు కి నూతన సర్వీస్ ప్రారంభం

- April 01, 2016 , by Maagulf
గన్నవరం నుండి బెంగళూరు కి నూతన సర్వీస్ ప్రారంభం

ప్రయాణికులకు మెరుగైన సేవలందించి వారి మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధిని సాధించాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు అన్నారు. ఎయిరిండియా విమానయాన సంస్ధ నూతనంగా బెంగళూరు నుంచి గన్నవరంకు సర్వీసును శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళేందుకు తొలి టికెట్‌ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు నడుస్తున్న మూడు సర్వీసులు ఢిల్లీ, హైదరాబాద్‌, వైజాగ్‌లకు ప్రయాణికుల ఆదరణ నోచుకున్నాయని చెప్పారు. ఈ నాల్గవ సర్వీసు కూడా అలానే నడపాలని కోరారు. ఎయిరిండియా స్టేషన మేనేజర్‌ ఎం.రామసుబ్రహ్మణ్యన మాట్లాడుతూ బెంగుళూరు నుంచి 32 మంది ప్రయాణికులు వచ్చారని, ఇక్కడ నుంచి 11 మంది వెళ్ళారని వివరించారు. సీట్ల 42 ఉన్నాయన్నారు. ప్రయాణికుల అభిరుచి మేరకు సర్వీసులను పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీకి మరో అదనపు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎయిరిండియా ఎయిర్‌పోర్టు మేనేజర్‌ డి.రజని, సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com