గన్నవరం నుండి బెంగళూరు కి నూతన సర్వీస్ ప్రారంభం
- April 01, 2016
ప్రయాణికులకు మెరుగైన సేవలందించి వారి మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధిని సాధించాలని ఎయిర్పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు అన్నారు. ఎయిరిండియా విమానయాన సంస్ధ నూతనంగా బెంగళూరు నుంచి గన్నవరంకు సర్వీసును శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళేందుకు తొలి టికెట్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు నడుస్తున్న మూడు సర్వీసులు ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్లకు ప్రయాణికుల ఆదరణ నోచుకున్నాయని చెప్పారు. ఈ నాల్గవ సర్వీసు కూడా అలానే నడపాలని కోరారు. ఎయిరిండియా స్టేషన మేనేజర్ ఎం.రామసుబ్రహ్మణ్యన మాట్లాడుతూ బెంగుళూరు నుంచి 32 మంది ప్రయాణికులు వచ్చారని, ఇక్కడ నుంచి 11 మంది వెళ్ళారని వివరించారు. సీట్ల 42 ఉన్నాయన్నారు. ప్రయాణికుల అభిరుచి మేరకు సర్వీసులను పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీకి మరో అదనపు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎయిరిండియా ఎయిర్పోర్టు మేనేజర్ డి.రజని, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







