దుబాయ్ కెన్.. తగ్గిన ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం
- March 24, 2022
            యూఏఈ: 'దుబాయ్ కెన్' చొరవతో 234,000 కంటే ఎక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం తగ్గింది. ఫిబ్రవరి 15న ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు సిటిజెన్స్/రెసిడెంట్స్, పర్యాటకులు దుబాయ్ కెన్ వాటర్ ఫౌంటైన్ల నుండి 117,000 లీటర్లకు పైగా నీటిని ఉచితంగా వినియోగించుకున్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగా ఐదు కొత్త వాటర్ ఫౌంటెన్లను ఆవిష్కరించారు. వీటితో కలిపి నగరంలో మొత్తం ‘దుబాయ్ కెన్’ వాటర్ ఫౌంటైన్ల సంఖ్యను 39కి చేరింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించిన ఈ కార్యక్రమం UAE లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గిస్తోంది. రీఫిల్ చేయగల బాటిళ్ల వినియోగం, ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలల్లో వాటర్ ఫిల్టర్లను ఇన్స్టాల్ చేయడం వంటి చర్యలను చేపట్టేలా ‘దుబాయ్ కెన్’ ప్రోత్సహిస్తుంది. దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ (DET) టూరిజం డెవలప్మెంట్ & ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యూసుఫ్ లూటా మాట్లాడుతూ.. డిసెంబర్ 2022 నాటికి నగరం అంతటా 50 దుబాయ్ ఫౌంటైన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దుబాయ్ క్యాన్ బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ప్లేస్ Noon.comలో 36.75 దిర్హాలకు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







