193 స్టేషన్లలో 1516 రైళ్లలో ఈ క్యాటరింగ్ ..
- April 03, 2016
రైల్వేమంత్రిత్వశాఖ ప్రతిరోజు లక్ష మందికి ఆహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ కాటరింగ్ విధానం ద్వారా రైళ్లలోనూ ప్రయాణికులకు నచ్చే ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసలుబాటు కల్పించనుంది. ఈ క్యాంటీన్ విధానంతో ప్రయాణికుల భోజన సమస్యలకు చెక్ పెట్టాలని గతంలోనే నిర్ణయించారు. ప్రతిరోజూ దాదాపు లక్ష భోజనాల వరకు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.193 స్టేషన్లలో 1516 రైళ్లలో ఈ క్యాటరింగ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. 2014లో కొన్ని రైళ్లలో ఈ సౌకర్యాన్ని కల్పించినా ప్రయాణికులకు అవసరాల దృష్ట్యా మరిన్ని సేవలను అందించాలని ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ క్యాంటిన్ విస్తరణను మొదలుపెట్టారు.ఐఆర్ సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ఎస్ఎంఎస్ పద్ధతులలో తమ ఆర్డర్ ను బుక్ చేసుకోవచ్చు. హల్దిరామ్స్, డోమినాస్ పిజ్జా, బికనిర్ వాలా, వింపి, ఇతర సంస్థలతో ఈ మేరకు రైల్వేశాఖ ఒప్పందాలు కుదుర్చుకోబోతుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









