638 మంది డ్రగ్స్ అనుమానితులు అరెస్ట్
- April 09, 2022
కువైట్: 2022 మొదటి త్రైమాసికంలో 638 మంది డ్రగ్స్ అనుమానితులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. స్మగ్లర్లు, డ్రగ్స్ పంపేవారిని ఎదుర్కోవడానికి ఇతర భద్రతా రంగాల సహకారంతో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది. ప్రత్యేక భద్రతా సంస్థల సమన్వయంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. డ్రగ్స్ ప్రమోటర్లు యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, డ్రగ్ పెడ్లర్లపై నిఘా పెట్టినట్టు పేర్కొంది. మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కొనేందుకు పౌరులు, నివాసితులు భద్రతా సేవలతో సహకరించాలని భద్రతా వర్గాలు పిలుపునిచ్చాయి. అన్ని కుటుంబాలు తమ పిల్లలపై పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. పిల్లలో మతపరమైన నైతిక విలువలను పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









