పుతిన్ కీలక నిర్ణయం...
- April 10, 2022
రష్యా: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి ఇప్పటికే 45 రోజులు గడిచాయి. అయినా… రష్యా తగ్గడం లేదు. వరసగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇన్ని రోజులుగా ప్రయత్నించినా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను మాత్రం రష్యా స్వాధీనం చేసుకోలేకపోయింది. కీవ్ ను స్వాధీనం చేసుకోలేక రష్యన్ బలగాలు వెనుదిరిగాయి.ఉక్రెయిన్ దళాలు ఎదురొడ్డి నిలుస్తుండటంతో రష్యన్ దళాలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా రష్యా 9 మంది కీలక కమాండర్లను కోల్పోయింది. 19,000మంది రష్యన్ సైనికులు యుద్ధంలో మరణించినట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్ ఆపరేషన్ కు చీఫ్ గా కొత్త వ్యక్తిని నియమించారు. సిరియాలో రష్యన్ ఆపరేషన్లకు సారథ్యం వహించిన అలెగ్జాండర్ డ్వోర్నికోవ్ ను ఉక్రెయిన్ ఆపరేషన్ కు చీఫ్ గా నియమించారు పుతిన్. అయితే ఈ నియామకం తర్వాత ఉక్రెయిన్- రష్యా యుద్ధం మరింతగా తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు సమాయత్తం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









