పుత్తింగళ్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన రాహుల్‌

- April 10, 2016 , by Maagulf
పుత్తింగళ్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన రాహుల్‌

అగ్నిప్రమాదం జరిగిన కేరళలోని పుత్తింగళ్‌ ఆలయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిశీలించారు. అదేవిధంగా కొల్లం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటన రాష్ట్రంతో పాటు దేశానికి పెను విశాదం. ముఖ్యమంత్రితో పాటు మా పార్టీ నాయకులతో ప్రమాద ఘటనపై మాట్లాడా. నిర్ణయాత్మకంగా వ్యవహరించి సహాయక చర్యలను వేగవంతం చేయాల్సిందిగా సూచించాం. కేంద్ర స్థాయిలో ఇంకేమైనా సహాయం కావాల్సి వస్తే పార్లమెంట్ ద్వారా చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com