450 మంది షార్జా పోలీసులకు ఆర్థిక పదోన్నతి
- July 05, 2022
షార్జా: పోలిస్ విభాగంలో చేరిన నాటి నుండి షార్జా పోలీసు విభాగంలోనే పనిచేస్తున్న 450 మంది నాన్ కమిషన్డ్ అధికారులకు ఆర్థిక పదోన్నతి ఇచ్చేందుకు షార్జా పాలకుడు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహ్మద్ అల్ కసిమి అంగీకరించారు.
నాన్ కమిషన్డ్ అధికారులు పోలీసింగ్ సంబంధించిన కోర్సును షార్జా పోలీస్ విభాగం అధ్వర్యంలో నడుస్తున్న షార్జా పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందుతున్నారు.
షార్జా పోలీస్ విభాగ అధిపతి మేజర్ జనరల్ సైఫ్ అల్ జారీ షంశి ఆర్థిక పదోన్నతి అంశం గురించి షార్జా రేడియో మరియు టీవి ద్వారా ప్రకటించారు. ఈ సమయంలోనే పదోన్నతులు కల్పించిన షార్జా పాలకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
షార్జా పోలీస్ విభాగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తన వంతు కృషి చేస్తున్న సుల్తాన్ కు మరియు పదోన్నతి పొందిన అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అధికారులను ఉద్దేశించి ప్రజల భద్రతా కోసం పోలిస్ విభాగంలో పనిచేస్తున్న మీరు అంకిత భావంతో ఎల్లప్పుడూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మేజర్ జనరల్ షంశి ఉద్ఘాటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!









