‘మేజర్’ ఓటీటీ దూకుడు మామూలుగా లేదుగా.!
- July 08, 2022
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆర్ధిక రాజధాని ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఉగ్ర దాడుల్లో హతమైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి దేశభక్తి కాన్సెప్ట్ ఆపాదించుకుని, ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. దేశభక్తి కాన్సెప్ట్ కావడంతో, కేవలం తెలుగు ప్రేక్షకుల నుంచే కాదు, ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఆదరణ దక్కించుకుంది.
కాగా, జూలై 3 నుంచి ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. ధియేటర్లలో అడవి శేష్ కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా గుర్తింపు దక్కించుకున్న ‘మేజర్’ ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది.
ఓటీటీ హిందీ వెర్షన్ ట్రెండింగ్లో టాప్ 1 పొజిషన్లో కొనసాగుతుండగా, తెలుగు వెర్షన్ టాప్ 2 స్థానాన్ని దక్కించుకుని రికార్డులు కొల్లగొడుతోంది. ఇండియాతో పాటు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల్లోనూ ‘మేజర్’ రికార్డులు కొల్టగొట్టేస్తున్నాడు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









