‘మేజర్’ ఓటీటీ దూకుడు మామూలుగా లేదుగా.!
- July 08, 2022
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆర్ధిక రాజధాని ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఉగ్ర దాడుల్లో హతమైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి దేశభక్తి కాన్సెప్ట్ ఆపాదించుకుని, ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. దేశభక్తి కాన్సెప్ట్ కావడంతో, కేవలం తెలుగు ప్రేక్షకుల నుంచే కాదు, ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఆదరణ దక్కించుకుంది.
కాగా, జూలై 3 నుంచి ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. ధియేటర్లలో అడవి శేష్ కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా గుర్తింపు దక్కించుకున్న ‘మేజర్’ ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది.
ఓటీటీ హిందీ వెర్షన్ ట్రెండింగ్లో టాప్ 1 పొజిషన్లో కొనసాగుతుండగా, తెలుగు వెర్షన్ టాప్ 2 స్థానాన్ని దక్కించుకుని రికార్డులు కొల్లగొడుతోంది. ఇండియాతో పాటు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల్లోనూ ‘మేజర్’ రికార్డులు కొల్టగొట్టేస్తున్నాడు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









