‘మేజర్’ ఓటీటీ దూకుడు మామూలుగా లేదుగా.!
- July 08, 2022
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆర్ధిక రాజధాని ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఉగ్ర దాడుల్లో హతమైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి దేశభక్తి కాన్సెప్ట్ ఆపాదించుకుని, ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. దేశభక్తి కాన్సెప్ట్ కావడంతో, కేవలం తెలుగు ప్రేక్షకుల నుంచే కాదు, ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఆదరణ దక్కించుకుంది.
కాగా, జూలై 3 నుంచి ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. ధియేటర్లలో అడవి శేష్ కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా గుర్తింపు దక్కించుకున్న ‘మేజర్’ ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది.
ఓటీటీ హిందీ వెర్షన్ ట్రెండింగ్లో టాప్ 1 పొజిషన్లో కొనసాగుతుండగా, తెలుగు వెర్షన్ టాప్ 2 స్థానాన్ని దక్కించుకుని రికార్డులు కొల్లగొడుతోంది. ఇండియాతో పాటు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల్లోనూ ‘మేజర్’ రికార్డులు కొల్టగొట్టేస్తున్నాడు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









