‘మేజర్’ ఓటీటీ దూకుడు మామూలుగా లేదుగా.!
- July 08, 2022
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆర్ధిక రాజధాని ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఉగ్ర దాడుల్లో హతమైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి దేశభక్తి కాన్సెప్ట్ ఆపాదించుకుని, ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. దేశభక్తి కాన్సెప్ట్ కావడంతో, కేవలం తెలుగు ప్రేక్షకుల నుంచే కాదు, ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఆదరణ దక్కించుకుంది.
కాగా, జూలై 3 నుంచి ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. ధియేటర్లలో అడవి శేష్ కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా గుర్తింపు దక్కించుకున్న ‘మేజర్’ ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది.
ఓటీటీ హిందీ వెర్షన్ ట్రెండింగ్లో టాప్ 1 పొజిషన్లో కొనసాగుతుండగా, తెలుగు వెర్షన్ టాప్ 2 స్థానాన్ని దక్కించుకుని రికార్డులు కొల్లగొడుతోంది. ఇండియాతో పాటు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల్లోనూ ‘మేజర్’ రికార్డులు కొల్టగొట్టేస్తున్నాడు.శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







