మెగా ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారా.?
- July 08, 2022
కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో ప్రేక్షకులు ధియేటర్లకు గుడ్ బై చెప్పేసి, ఓటీటీకి అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా, స్టార్ హీరో సినిమా అయినా టేక్ లైట్.. అనే స్థాయికి సగటు ప్రేక్షకుడి ఒపీనియన్ పడిపోయింది.
నెల రోజులు వెయిట్ చేస్తే చాలు.. ఎంత గొప్ప సినిమా అయినా ఓటీటీలో రావల్సిందే.. అనే ఆలోచనలో ప్రేక్షకుడున్నాడు. దాంతో ధియేటర్లలో సినిమా చూసేందుకు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. దాంతో, స్టార్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సైతం ఓటీటీ కంటెంట్పై ఫోకస్ ఛేంజ్ చేసుకున్నారు.
అలా ఓటీటీలో మంచి కంటెంట్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే సమంత, కాజల్ అగర్వాల్ తదితర స్టార్ ముద్దుగుమ్మలు ఓటీటీలో సందడి చేశారు. చేస్తున్నారు. ఇప్పటికే ఓ మోస్తరు హీరోలు ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల ఫోకస్ కూడా ఓటీటీ వైపు మళ్లిన సంగతి తెలిసిందే.
ఆల్రెడీ వెంకటేష్ ఓ ఓటీటీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రానాతో కలిసి వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కూడా త్వరలో ఓటీటీ తెరపై సందడి చేయబోతున్నారట. ఈ మధ్యనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ, మెగాస్టార్ చిరంజీవితో డీల్ సెట్ చేసుకుందట.
చిరంజీవి తన స్టార్డమ్కి సెట్ అయ్యే కథతో వస్తే, ఖచ్చితంగా కలిసి పని చేద్దాం.. అని సదరు ఓటీటీ సంస్థకు మాటిచ్చాడట. మెగా మాటంటే మామూలు విషయం కాదు. సో, సదరు ఓటీటీ పుణ్యమా అని, త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుడు తన నట్టింటికి తీసుకొచ్చేసుకోనున్నాడన్నమాట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







