సుమంత్ మే నెలాఖారున..
- April 12, 2016
'సత్యం', 'గోదావరి', 'గోల్కొండ హై స్కూల్' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చకున్న సుమంత్ తెరమీదికొచ్చి రెండేళ్ళు గడిచింది. 2014లో 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' సినిమా చేసిన ఈ అక్కినేని హీరో అటుపై మరో సినిమాకి సైన్ చేయనే లేదు. కొద్ది కాలం క్రితం మొదలైన హిందీ సినిమా 'విక్కీ డోనర్' రీమేక్తో సుమంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందట. ప్రస్తుతం నిర్మాణాంతర దశలో ఉన్న ఈ సినిమా మే నెలాఖరున విడుదల కానుందిట. పల్లవి సుభాష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతోనైనా సుమంత్ నిలదొక్కుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







