సుమంత్ మే నెలాఖారున..
- April 12, 2016
'సత్యం', 'గోదావరి', 'గోల్కొండ హై స్కూల్' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చకున్న సుమంత్ తెరమీదికొచ్చి రెండేళ్ళు గడిచింది. 2014లో 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' సినిమా చేసిన ఈ అక్కినేని హీరో అటుపై మరో సినిమాకి సైన్ చేయనే లేదు. కొద్ది కాలం క్రితం మొదలైన హిందీ సినిమా 'విక్కీ డోనర్' రీమేక్తో సుమంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందట. ప్రస్తుతం నిర్మాణాంతర దశలో ఉన్న ఈ సినిమా మే నెలాఖరున విడుదల కానుందిట. పల్లవి సుభాష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతోనైనా సుమంత్ నిలదొక్కుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









