సుమంత్ మే నెలాఖారున..

- April 12, 2016 , by Maagulf
సుమంత్ మే నెలాఖారున..

'సత్యం', 'గోదావరి', 'గోల్కొండ హై స్కూల్' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చకున్న సుమంత్ తెరమీదికొచ్చి రెండేళ్ళు గడిచింది. 2014లో 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' సినిమా చేసిన ఈ అక్కినేని హీరో అటుపై మరో సినిమాకి సైన్ చేయనే లేదు. కొద్ది కాలం క్రితం మొదలైన హిందీ సినిమా 'విక్కీ డోనర్' రీమేక్‌తో సుమంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందట. ప్రస్తుతం నిర్మాణాంతర దశలో ఉన్న ఈ సినిమా మే నెలాఖరున విడుదల కానుందిట. పల్లవి సుభాష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతోనైనా సుమంత్ నిలదొక్కుకుంటాడేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com