ఇ-కామర్స్ సర్వీస్ని ప్రారంభించిన 'క్యూ' పోస్ట్
- April 12, 2016
ఖతార్ పోస్టల్ సర్వీసెస్ కంపెనీ (క్యూ పోస్ట్) ఇ-కామర్స్ మార్కెట్ని క్యాష్ చేసుకునేందుకు 'కనెక్టెడ్పై బై కతార్ పోస్ట్' అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. ప్రపంచంలో ఇ-కామర్స్ మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో ఖతార్ పోస్ట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ జస్సిమ్ సైఫ్ అహ్మద్ అల్ సులాటీ, అరబ్ ఫ్యూచర్ సిటీస్ సమ్మిట్లో 'ఇంటర్నేషనల్ పార్సెల్ ఫార్వార్డింగ్ సర్వీస్'ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. క్యు పోస్ట్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫలే అల్ నైయెమి మాట్లాడుతూ, దేశంలో నివసిస్తున్నవారు ఈ కొత్త సర్వీసులతో వెసులుబాటు పొందుతారని ఆకాంక్షించారు. యూఎస్ మరియు యూకే నుంచి పోస్టల్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్స్ని చేసుకోగలుగుతారని ఆయన చెప్పారు. అతి కొద్ది వారాల్లోనే ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ని జపాన్, చైనా మరియు జర్మనీలకు విస్తరిస్తామనీ, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు నెట్వర్క్ విస్తరిస్తుందని చెప్పారు. ఖతార్ రెసిడెంట్స్ నుంచి క్యు పోస్ట్ ఫీడ్ బ్యాక్ని ఆహ్వానిస్తుందనీ, తద్వారా మరింత మెరుగ్గా ఈ సర్వీసును విస్తరించడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఇ-లాకర్ సిస్టమ్ ద్వారా కస్టమర్ ఓ ప్రత్యే పాస్వర్డ్ ద్వారా తన పార్సెల్ని కనెక్ట్ చేసుకునేలా ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









