ఒమన్లో స్కూల్ బస్సుల కోసం కొత్త మానిటర్ సిస్టమ్
- April 12, 2016
పబ్లిక్ స్కూల్ బస్సులను ట్రాక్ చేయడానికి కొత్త సిస్టమ్ని డెవలప్ చేశారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ మదిహా బింట్ అహ్మద్ అల్ షిబానియా ఈ సిస్టమ్ని లాంచ్ చేశారు. స్కూలు విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రూపొందిన ఈ సిస్టమ్లో మొత్తం నాలుగు కెమెరాలు బస్సు వెలుపల, రెండు కెమెరాలు బస్సులోపల ఉంటాయి. అంతే కాకుండా మొత్తం 8 సెన్సార్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సిస్టమ్ జిపిఎస్కి కనెక్ట్ అయి ఉంటుంది. బస్సు ఎలా ప్రయాణిస్తోంది, బస్సులో పరిస్థితులేంటి, రోడ్డుపై పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరేలా ఈ సిస్టమ్ని రూపొందించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు కనెక్ట్ అయ్యేలా ఈ సిస్టమ్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కొత్త విధానం పట్ల పబ్లిక్లో అవేర్నెస్ పెంచడానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నామని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







