ఒమన్లో స్కూల్ బస్సుల కోసం కొత్త మానిటర్ సిస్టమ్
- April 12, 2016
పబ్లిక్ స్కూల్ బస్సులను ట్రాక్ చేయడానికి కొత్త సిస్టమ్ని డెవలప్ చేశారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ మదిహా బింట్ అహ్మద్ అల్ షిబానియా ఈ సిస్టమ్ని లాంచ్ చేశారు. స్కూలు విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రూపొందిన ఈ సిస్టమ్లో మొత్తం నాలుగు కెమెరాలు బస్సు వెలుపల, రెండు కెమెరాలు బస్సులోపల ఉంటాయి. అంతే కాకుండా మొత్తం 8 సెన్సార్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సిస్టమ్ జిపిఎస్కి కనెక్ట్ అయి ఉంటుంది. బస్సు ఎలా ప్రయాణిస్తోంది, బస్సులో పరిస్థితులేంటి, రోడ్డుపై పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరేలా ఈ సిస్టమ్ని రూపొందించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు కనెక్ట్ అయ్యేలా ఈ సిస్టమ్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కొత్త విధానం పట్ల పబ్లిక్లో అవేర్నెస్ పెంచడానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నామని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









