ఎయిర్ అరేబియా విమానం కొచ్చిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- July 16, 2022కొచ్చి: షార్జాకు వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా జి9–426 విమానం సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో వెంటనే అప్రమత్తమైన కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు 45 నిమిషాల వ్యవధిలో పరిస్థితులు అన్నింటినీ చక్కదిద్దినట్లు విమానాశ్రయం ఎండీ ఎస్.సుహాస్ తెలిపారు. ఇక్కడకు రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఎయిర్ అరేబియా విమానంలోని 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
విమానం ఇంజిన్ కంపించడం వల్ల దిల్లీ నుంచి వడోదరా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ను జైపుర్కు అత్యవసరంగా దారి మళ్లించారు.ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. విమానం ఇంజనులో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ దారి మళ్లింపు జరిగిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని డీజీసీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు