సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత సింధూ..
- July 17, 2022
సింగపూర్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ సింగపూర్ ఓపెన్-2022 ఉమెన్స్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై, సింధు విజయం సాధించారు. 21-9, 11-21, 21-15 తేడాతో సింధు, వాంగ్ జిని ఓడించింది. మొదటి గేమ్ను సింధు గెలుచుకోగా, రెండో గేమ్లో దారుణంగా ఓడిపోయింది.
తర్వాత చివరిదైన మూడో గేమ్లో అద్భుత ప్రతిభ కనబరిచి, సింగపూర్ ఓపెన్, సూపర్ 500 టైటిల్ గెలుచుకుంది. భారత దేశం నుంచి ఈ టైటిల్ సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది. ఇంతకుముందు ఈ టైటిల్ సైనా నెహ్వాల్ గెలుచుకుంది. పురుషుల విభాగంలో 2017లో సాయి ప్రణీత్ కూడా గెలుపొందాడు. ఈ ఏడాది ఇది సింధు గెలిచిన మూడో టైటిల్ కాగా, మొదటి సూపర్-500 టైటిల్. ఇంతకుముందు గెలిచిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్.. రెండూ సూపర్-300 టైటిళ్లే.
వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ మెడల్స్తో కలిపి ఇది సింధు తన కెరీర్లో సాధించిన 18వ టైటిల్. సింధు సాధించిన ఈ విజయం ఈ నెల 28న బర్మింగ్హమ్లో ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్కు మరింత స్ఫూర్తినిస్తుంది. ఈ విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, తను మరో మెట్టు ఎక్కేందుకు దోహద పడుతుందని సింధు మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









