ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- August 07, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ టామాక్ ఏరియాలో ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.శనివారం రాత్రి స్పైస్జెట్ విమానం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకుంది. 11.24 గంటలకు విమానం ల్యాండ్ అయినప్పటికీ, ప్రయాణికుల్ని తీసుకెళ్లడానికి బస్సు రాలేదు.
విమానం నుంచి దిగిన ప్రయాణికులు, అక్కడ్నుంచి బస్సులోనే ఎయిర్పోర్ట్ టర్మినల్ చేరుకోవాల్సి ఉంటుంది. బస్సును ఎయిర్పోర్టుతోపాటు, విమానయాన సంస్థ కలిసి ఏర్పాటు చేయాలి. అలాగే భద్రతా కారణాల రీత్యా టామాక్ ఏరియాలో ప్రయాణికులు నడవడానికి అనుమతి లేదు. కానీ, విమానం ల్యాండ్ అయి 45 నిమిషాలు అయినప్పటికీ బస్సు చేరుకోలేదు. దీంతో విసిగిపోయిన కొందరు ప్రయాణికులు నేరుగా టామాక్ ఏరియా నుంచి నడుచుకుంటూ వెళ్లారు. కానీ, వారు ఎయిర్పోర్టు టర్మినల్ చేరుకునే లోపే బస్సు వచ్చింది. దీంతో విమానంలోని మిగతా ప్రయాణికులు, నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లు అంతా కలిసి బస్సులోనే తిరిగి వెళ్లారు. కానీ, ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
ఇలా ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లడం నిషేధమని, దీనిపై జవాబు ఇవ్వాలని స్పైస్జెట్ సంస్థను ఆదేశించింది. దీనిపై ఆ సంస్థ స్పందించింది. తాము బస్సుల కోసం ఎయిర్పోర్టు సిబ్బందికి చెప్పినప్పటికీ, అవి రావడం ఆలస్యమైందని, ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పినప్పటికీ వారిలో కొందరు వినిపించుకోకుండా నడుచుకుంటూ వెళ్లారని ఆ సంస్థ చెప్పింది. అయితే, వారిని కూడా చివరకు బస్సులోనే తీసుకెళ్లామని వివరించింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







