హజ్ యాత్రికుల నిష్క్రమణకు ఆగస్ట్ 13 డెడ్ లైన్
- August 11, 2022
రియాద్ : ఈ సంవత్సరం హజ్ చేసిన యాత్రికులు సౌదీ అరేబియా నుండి బయలుదేరడానికి ఆగస్టు 13 (శనివారం)ను తుది గడువుగా నిర్ణయించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాలలో యాత్రికులకు సేవలను అందించే తవాఫా కంపెనీలు యాత్రికుల నిష్క్రమణ షెడ్యూల్కు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు యాత్రికుల బృందాల నిష్క్రమణను సులభతరం చేయడానికి మంత్రిత్వ శాఖ కంపెనీలను అప్రమత్తం చేసింది. సౌదీలో హజ్ వ్యవహారాలను నిర్వహించే కంపెనీలలో యాత్రికుల వివరాలను తనిఖీ చేయాలని అధికారులకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆర్గనైజింగ్ కంపెనీల ద్వారా ఈ సేవల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఉమ్రా పర్యటనలో ఉన్న యాత్రికుల డాక్యుమెంట్ కాంట్రాక్టును పరిశీలించాలని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







