హజ్ యాత్రికుల నిష్క్రమణకు ఆగస్ట్ 13 డెడ్ లైన్
- August 11, 2022
రియాద్ : ఈ సంవత్సరం హజ్ చేసిన యాత్రికులు సౌదీ అరేబియా నుండి బయలుదేరడానికి ఆగస్టు 13 (శనివారం)ను తుది గడువుగా నిర్ణయించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాలలో యాత్రికులకు సేవలను అందించే తవాఫా కంపెనీలు యాత్రికుల నిష్క్రమణ షెడ్యూల్కు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు యాత్రికుల బృందాల నిష్క్రమణను సులభతరం చేయడానికి మంత్రిత్వ శాఖ కంపెనీలను అప్రమత్తం చేసింది. సౌదీలో హజ్ వ్యవహారాలను నిర్వహించే కంపెనీలలో యాత్రికుల వివరాలను తనిఖీ చేయాలని అధికారులకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆర్గనైజింగ్ కంపెనీల ద్వారా ఈ సేవల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఉమ్రా పర్యటనలో ఉన్న యాత్రికుల డాక్యుమెంట్ కాంట్రాక్టును పరిశీలించాలని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







