కైరో: చర్చిలో అగ్నిప్రమాదం.. 41 మంది మృతి
- August 14, 2022
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో ఉన్న కాప్టిక్ క్రిస్టియన్ చర్చిలో ఆదివారం అగ్నప్రమాదం జరిగి సుమారు 41 మంది మృతి చెందినట్లు ఆ చర్చి అధికారులు ప్రకటించారు.అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియవని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై ఈజిప్టు అధినేత అబ్దెల్ ఫట్టా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫేస్బుక్ ద్వారా ఆయన స్పందిస్తూ ‘‘ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాను, అలాగే ప్రమాద తీవ్రతను తగ్గించే చర్యలు చేపట్టమని చెప్పాను’’ అని తెలిపారు. ప్రమాదం జరిగిన కొద్ది సమయానికి మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపింది.
మధ్యప్రాచ్యంలో కాప్ట్స్ అతిపెద్ద చర్చి. అంతే కాదు ఈ చర్చి నేతృత్వంలోని ఈజిప్టులోనే అతిపెద్ద క్రైస్తవ సంఘం ఉంది. ఈజిప్టులోని 103 మిలియన్ల జనాభాలో కనీసం 10 మిలియన్లు ఈ సంఘంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇస్లామిస్టులకు క్రిస్టియన్లకు మధ్య చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. 2013లో ఇస్లామిస్ట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మోర్సీని పదవీచ్యుతున్ని చేసిన అనంతరం దేశంలో పలు చోట్ల చర్చిలు, పాఠశాలలు, నివాసాలు దగ్ధమయ్యాయి.
అనంతరం సిసి దేశాధినేత అయ్యారు. మొదటిసారి చర్చిని సందర్శించిన ఈజిప్టు నేత సిసి రికార్డు సృష్టించారు. ఇటీవలే మొదటిసారిగా రాజ్యాంగబద్ధ న్యాయస్థాన పదవిలో కాప్టిక్ వ్యక్తిని నియమించారు. కాగా, ఇటీవలిలో ఈజిప్ట్ అనేక ఘోరమైన అగ్నిప్రమాదాలు జరిగాయి. మార్చి 2021లో కైరోలోని తూర్పు శివారులోని వస్త్ర కర్మాగారంలో తలెత్తిన అగ్ని ప్రమాదంలో 20 మంది మరణించారు. 2020లో రెండు ఆసుపత్రులు మంటల్లో చిక్కుకోవడంతో 14 మంది కోవిడ్-19 రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







