సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- June 28, 2026
అబుదాబి: సౌదీ అరేబియాలోని రాస్ తనూరా ప్రాంతంలో సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ కూలి అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందిన ఘటనపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాద ఘటనలో సౌదీ అరేబియాకు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ యూఏఈ సంతాపం తెలిపింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) విడుదల చేసిన ప్రకటనలో, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అలాగే ఈ విషాద సమయంలో సౌదీ ప్రభుత్వం, ప్రజలకు యూఏఈ తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తోందని పేర్కొంది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించిన యూఏఈ, మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ఆకాంక్షించింది. ఈ క్లిష్ట సమయంలో సౌదీ అరేబియాతో తాము అండగా ఉంటామని యూఏఈ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!







