యుఏఈ లో మధ్యాహ్న విరామం నేటినుంచే
- June 15, 2015
మండుతున్న ఎండల నుంచి కార్మికులకు ఉపశమనం కల్పించేందుకు ‘మధ్యాహ్న విరామం’ అనే నిబంధనను ప్రభుత్వం ప్రతి యేటా అమలు చేస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా నేటి నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలపాటు ఎండల్లో పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా ఆయా కంపెనీలు పనికి విరామం కల్పించాల్సి ఉంటుంది. విరామ సమయాన్ని మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటలు వరకు నిర్ణయించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 15 వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుంది. కార్మికులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈ నిబంధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ నిబంధన ద్వారా పనివేళలు కుదించుకుపోతాయనీ, తద్వారా అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కాబోవని నిర్మాణ రంగ సంస్థలు అంటున్నాయి. అయినప్పటికీ కార్మికుల భద్రతే లక్ష్యంగా వ్యవహరిస్తున్న తాము ప్రభుత్వ నిబందనలకు తగ్గట్లుగా కార్మికులకు విరామ సమయాన్ని కేటాయిస్తామని వివిధ సంస్థలు చెప్పాయి. 18 బృందాల్ని నిరంతర తనిఖీల కోసం కేటాయించిన ప్రభుత్వం, వివిధ ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేసింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







