యుఏఈ లో మధ్యాహ్న విరామం నేటినుంచే
- June 15, 2015
మండుతున్న ఎండల నుంచి కార్మికులకు ఉపశమనం కల్పించేందుకు ‘మధ్యాహ్న విరామం’ అనే నిబంధనను ప్రభుత్వం ప్రతి యేటా అమలు చేస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా నేటి నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలపాటు ఎండల్లో పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా ఆయా కంపెనీలు పనికి విరామం కల్పించాల్సి ఉంటుంది. విరామ సమయాన్ని మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటలు వరకు నిర్ణయించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 15 వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుంది. కార్మికులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈ నిబంధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ నిబంధన ద్వారా పనివేళలు కుదించుకుపోతాయనీ, తద్వారా అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కాబోవని నిర్మాణ రంగ సంస్థలు అంటున్నాయి. అయినప్పటికీ కార్మికుల భద్రతే లక్ష్యంగా వ్యవహరిస్తున్న తాము ప్రభుత్వ నిబందనలకు తగ్గట్లుగా కార్మికులకు విరామ సమయాన్ని కేటాయిస్తామని వివిధ సంస్థలు చెప్పాయి. 18 బృందాల్ని నిరంతర తనిఖీల కోసం కేటాయించిన ప్రభుత్వం, వివిధ ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేసింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







