చైనా ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్సైట్లపై నిఘా పెంచాలని నిర్ణయం..
- April 15, 2016
యూజర్లను పెంచుకోవడానికి ఆన్లైన్ లైవ్స్ట్రీమింగ్ వెబ్సైట్లు ఎంత దూరమైన వెలుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల్లో అశ్లీలత, గేమ్లలో హింసను ప్రేరేపించే కంటెంట్లు ఎక్కువగా వాడుతున్నాయి. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా చైనా ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్సైట్లపై నిఘా పెంచాలని నిర్ణయం తీసుకుంది. వివిధ ఆన్లైన్ లైవ్స్ట్రీమింగ్ వెబ్సైట్లలో 20 కోట్లకు పైగా యూజర్లు రిజిస్టర్ చేసున్నారని చైనా సంస్కృతికి శాఖ తెలిపింది. అశ్లీల కార్యక్రమాలు, హింసను ప్రేరేపించేలా ఉన్న ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాని భావిస్తుంది. దీనిలో భాగంగానే నిబంధనలను విరుద్ధంగా కార్యక్రమాను నిర్వహిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ప్రత్యక్షప్రసారాలను చేసే వెబ్సైట్లపై చైనా సంస్కృతికి శాఖ గురువారం విచారణకు ఆదేశించింది.వీటిలో చైనాలో ఎంతగానో పేరున్న(douyu.com, zhanqi.tv) ప్రముఖ వెబ్సైట్లు కూడా ఉన్నాయి. జనవరిలో douyu.com లో తెల్లవారు జామున ఆన్లైన్ హోస్ట్ చేసే వ్యక్తి మరో మహిళతో శృంగారంలో పాల్గొంటూ ప్రత్యక్షప్రసారం చేశాడు. దీంతో ఈ సంఘటన పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే సదరు వెబ్సైట్ యాజమాన్యం ఆ ఉద్యోగిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని వివరణ ఇచ్చుకుంది. అప్పటి నుంచే ఆన్లైన్ లైవ్స్ట్రీమింగ్ వెబ్సైట్స్ పై ప్రభుత్వ నియంత్రణలోపించిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









