ఢిల్లీ లిక్కర్ స్కామ్.. 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు
- September 06, 2022
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఈరోజున ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబయి, బెంగుళూరులోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమీషనర్ అరవ గోపీ కృష్ణ ఇంట్లోనూ ఇటీవల ఈడీ సోదాలు చేపట్టింది. కొత్త అబ్కారీ విధానం అమలు జరగకుండా లిక్కర్ మాఫియా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో సీబీఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ ల్యాండరింగ్ కేసును బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









