స్వామినారాయణ్ మందిర్ పై దాడి..
- September 15, 2022
కెనడా: కెనడాలోని టొరంటోలో ఉన్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (బీఏపీఎస్) మందిర్లోని కొంత భాగాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసి, భారత్ కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ఆ ఆలయంలో జరిగిన ఈ ఘటనను కెనడాలోని భారత హై కమిషన్ ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరింది.
దుండగులు మందిరాన్ని ధ్వంసం చేస్తున్నట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మందిర గోడలపై ఖలిస్థానీ నినాదాలు కూడా రాశారు. ఈ ఘటనపై బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ స్పందిస్తూ మందిరంలో చోటుచేసుకున్న ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇటువంటి ద్వేషపూరిత ఘటనలను కెనడా సహించబోదని అన్నారు.
త్వరలోనే నేరస్థులను పట్టుకుంటామని అన్నారు. స్వామినారాయణ్ మందిరంలో విధ్వంసానికి పాల్పడిన ఘటనను ఖండిస్తున్నట్లు కెనాడలోని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య చెప్పారు. కెనడాలోని హిందూ ఆలయాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొలిసారి కాదని అన్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పారు. కెనడాలోని హిందువులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం







