ఫీజు చెల్లించలేదని క్లయింట్ పై దావా వేసిన లాయర్
- September 21, 2022
యూఏఈ: ఫీజు చెల్లించలేదని క్లయింట్ పైనే లాయర్ దావా వేసిన వింత సంఘటన యూఏఈ లో జరిగింది. ఈ దావా కు సంబంధించి లాయర్ కు అనుకూలంగా తీర్పు రావటం విశేషం. లాయర్ ఫీజుతో పాటు డాక్యుమెంట్స్ కు అయిన ఖర్చులన్నీ చెల్లించాలని అల్ ఐన్ కోర్టు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే ఓ మహిళ తన కేసు వాదించేందుకు లాయర్ ను పెట్టుకుంది. ముందుగానే ఫీజు, డాక్యుమెంటేషన్ ఖర్చు ఇస్తానని లాయర్ కు హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించింది. దీంతో సదరు లాయర్ తీవ్రంగా హార్ట్ అయ్యాడు. ఏకంగా తన క్లయింట్ నే కోర్టుకు ఇడ్చాడు. ఫీజు కు సంబంధించి ఓప్పంద పత్రం, కేసు వాదనల కాపీలను కోర్టు ముందుంచాడు. తనకు క్లయింట్ నుంచి 17, 950 దిర్హామ్ లు రావాలని కోర్టుకు చెప్పాడు. దీంతో ఆ మహిళను న్యాయస్థానం మందలించింది. ఒప్పందం ప్రకారం లాయర్ కు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









