బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ కన్నుమూత..
- September 21, 2022
ముంబై: బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ద్వారా కెరీర్ ప్రారంభించిన “రాజు శ్రీవాస్తవ”. ‘మైనే ప్యార్ కీయ’, ‘బాజిగర్’, ‘తేజాబ్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడంతో ఆయన ఫేట్ మారిపోయింది అనే చెప్పాలి. శక్తిమ్యాన్, ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా పలు టెలివిజన్ కామెడీ షోస్ తో స్టాండ్-అప్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘శ్రీవాస్తవ’ను 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి ఆయనను నామినేట్ చేశారు. దీంతో రాజు శ్రీవాస్తవ వివిధ నగరాల్లో తన కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతను ప్రోత్సహిస్తూ షోస్ కూడా నిర్వహించారు. ఇక 58 ఏళ్ళ వయసున్న శ్రీవాస్తవ ఈరోజు ఉదయం 10:20 గంటలకు మరణించారు.
ఆగస్టు 10న అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావడంతో, ఆయనను ఢిల్లీలోని AIIMSకి తరలించారు. అప్పటి నుంచి 40 రోజులకు పైగా స్పృహలోకి రాలేదు. గుండెపోటు రావడంతో అతడి మెదడు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ, అతని ఆరోగ్యం క్షీణిస్తూనే వస్తుండడంతో ఈరోజు ఉదయం ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









