కువైట్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని అనుబంధ పాఠశాలలను మూసివేయాలని ప్రైవేట్ ఎడ్యుకేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు సెప్టెంబరు 29న సెలవు దినంగా ప్రకటిస్తూ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ అసెంబ్లీకి కొత్త సభ్యులను ఎన్నుకోవడానికి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 29న నిర్వహించనున్నారు.