జోర్డాన్ రాజు పర్యటన.. స్కూల్స్ మూసివేత

- October 03, 2022 , by Maagulf
జోర్డాన్ రాజు పర్యటన.. స్కూల్స్ మూసివేత

మస్కట్: జోర్డాన్ రాజు పర్యటన కారణంగా మస్కట్‌లోని పాఠశాలలు మంగళవారం మధ్యాహ్నం తర్వాత మూసివేయనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. సీబ్, బాషర్, ముత్రా, మస్కట్, అమెరత్‌లోని విలాయత్‌లలోని పాఠశాలలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు మూసివేయనున్నారు. అలాగే మంగళవారం సీబ్, అమెరత్‌లలో సాయంత్రం పాఠశాలలు పనిచేయవని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జోర్డాన్ రాజ్యం రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఒమన్ సుల్తానేట్‌ను అధికారిక పర్యటన నిమిత్తం మంగళవారం రానున్నారు.  ఆయన రాజ్యంలో రెండు రోజులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com