శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ తేజ్..
- April 19, 2016
ఆరడుగులకు పైగా ఎత్తు....మ్యాన్లీ లుక్స్, నేచురల్ యాక్టింగ్తో వరుణ్తేజ్ మూడు సినిమాలతోనే ప్రామిసింగ్ స్టార్ అనిపించుకున్నారు. ఆయన నటించిన 'కంచె' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించడంతో ఒక్కసారిగా క్రేజ్కు కేరాఫ్ అడ్రస్గా మారారు. దాంతో ఆయన తదుపరి చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'మిస్టర్' అనే టైటిల్ ఖరారు చేశారు.లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై 'ఠాగూర్' మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ మే 15 నుంచి స్పెయిన్లో జరగనుంది. ఇందులో లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్ కథానాయికలు. నిర్మాతలు 'ఠాగూర్' మధు, నల్ల మలుపు శ్రీనివాస్(బుజ్జి) మాట్లాడుతూ-''ఈ చిత్రానికి స్క్రిప్టు చాలా బాగా వచ్చింది.ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ సిద్ధమవుతోంది. ఊటీలో దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు గోపీమోహన్, శ్రీధర్ సీపానలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నెలాఖరున లాంచనంగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: యువరాజ్, సమర్పణ: బేబీ భవ్య.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







