మస్కట్ : బురైమి గవర్నరేట్లో వాహనాల నుండి నగదు దొంగిలించిన ఆరోపణలపై తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, మహ్దా విలాయత్లోని స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ మద్దతుతో వాహనాల నుండి దొంగిలిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆర్వోపీ తెలిపింది. వాహనదారులు తమ వాహనాల్లో నగదు, విలువైన వస్తువులను పెట్టవద్దని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు.