హైదరాబాద్లో ప్రారంభానికి సిద్దమైన అమెరికా కాన్సులేట్ ఆఫీస్
- November 26, 2022
హైదరాబాద్: హైదరాబాద్లో నిర్మించిన అమెరికా కాన్సులేట్ ఆఫీస్ ప్రారంభానికి సిద్ధమైంది. నానక్రామ్గూడాలో ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న అమెరికా కాన్యులేట్ త్వరలోనే హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది. భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించడమే ఈ ఆఫీస్ ముఖ్యలక్ష్యం. 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవనానికి సుమారు 297 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు సమాచారం.
ఈ యూఎస్ కాన్సులేట్ ఆసియాలనే అతిపెద్దదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నూతన ఆఫీస్లో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. దీంతో వీసా సేవలు మరింత సులభం కానున్నాయి. ఇక అమెరికా వెళ్లాలనుకునే వారు వీసా దరఖాస్తు, ఇంటర్వ్యూల కోసం కాన్సులేట్ కార్యాలయానికి వెళ్తారనే విషయం తెలిసిందే. 2008కి ముందు హైదరాబాద్లో యూస్ కాన్సులేట్ లేదు. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు కచ్చితంగా చెన్నై వెళ్లాల్సి వచ్చేది. దీంతో హైదరాబాద్లోని బేగం పేట పైగా ప్యాలెస్లో అమెరికా కాన్యులేట్ కార్యకలాపాలు మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







