రాయితీల మళ్లింపు ద్వారా 631మిలియన్ బహేరిన్ దినార్ల ఆధా
- April 25, 2016
మనామా: రాయితీల మళ్లింపు ద్వారా 631 మిలియన్ బహేరిన్ దినార్ల ఆదా చేసినట్లు ఆర్థిక మంత్రి షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. దేశంలో పన్నుల పెరుగుదల పరిధికి సంబంధించి పార్లమెంటరీ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. " 631.6 మిలియన్ బహేరిన్ దినార్ల రాయితీలు మళ్లింపును క్రమంగా ప్రవేశపెట్టడానికి ఏడాది చివరి నాటికి అంచనా ఆదాయం ఉందని ." షేక్ అహ్మద్ అన్నారుప్రభుత్వ అధికారుల వ్యయం తగ్గింపు నుండి అంచనా ఆదాయం 562.3 మిలియన్ బహేరిన్ దినార్ల చమురు కాని ఆదాయాల నుండి 217.9 మిలియన్ బహేరిన్ దినార్ల వరకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు."ఆర్థిక మంత్రిత్వ శాఖ చొరవతో ప్రభుత్వ వ్యయాల హేతుబద్ధంగా కట్టడి చేసి మరియు ప్రజా ఆదాయాలని పెంచే విధంగా కార్యక్రమాలు సమితి అమలు చేస్తున్నది. అదనంగా, ఉద్యోగం ప్రారంభాలు, ఆర్థిక పునాది రంగాలలోకి మరియు ఉత్పాదకత అభివృద్ధి ఉన్నాయి కొత్త కార్యక్రమాలు దేశంలోని ఆదాయం లోకి అదనపు 79.6 మిలియన్ బహేరిన్ దినార్ల వరకు పెంపుదల ఉండవచ్చని ఆయన తెలిపారు.రాబోయే మంగళవారం నాడు జరిగే సమావేశంలో తన స్పందన బహరేన్ ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ గురించి మరిన్ని వివరాలను ఎంపీలు ముందు చర్చింఛి మంత్రి సమాధానం చెప్పనున్నారు .ఇంతకుముందు చెప్పినట్లుగా బహరేన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొని అనవసర ఖర్చు తగ్గించాలని, ప్రభుత్వ అధికారులు విలీనం మరియు రాయితీలు రద్దు చేయనున్నారు. కొన్ని వర్గాలుకు అందించే మాంసం, గాసోలిన్, డీజిల్, కిరోసిన్, విద్యుత్ మరియు నీటి వంటి సబ్సిడీతో వస్తువుల రాయతీలు ప్రధానంగా బహ్రేయినీ పౌరులకు ప్రయోజనకరంగా మళ్లించబడతాయ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







