ఇళ్ళ నిర్మాణం వేగవంతం: మినిస్టర్ బాసిమ్
- April 25, 2016
ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ బషీమ్ అల్హమీర్ చెప్పారు. అబు దహమ్ మరియు బురి విలేజెస్లో అధికారులతో కలిసి పర్యటించిన మినిస్టర్ బషీమ్, స్థానికులు ఇళ్ళ కోసం పడ్తున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా డైరెక్షన్లో, ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి త్వరలోనే ఇళ్ళను కేటాయిస్తామని వివరించారు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేశామనీ, ప్రస్తుతం 25,000 హౌసింగ్ యూనిట్స్ని 2018 నాటికి పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేస్తామని ఆయన చెప్పారు. ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి త్వరగా ఇళ్ళు లభించేలా అప్లికేషన్ ప్రాసెస్ని వేగవంతం చేస్తున్నామని మినిస్టర్ బషీమ్ అల్ హమిర్ వివరించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







