ప్రమాదంలో విద్యార్థి తల్లి మృతి, విద్యార్థికి తీవ్రగాయాలు
- April 25, 2016
యూనివర్సిటీ ఆఫ్ దామమ్ గ్రాడ్యుయేషన్ హాల్ నుంచి వెళుతూ, ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ విద్యార్థిని ఖాతిర్ అల్ సలామ్గా గుర్తించారు. ఖాతిర్, ఆమె తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలచివేసింది. రోడ్డుని దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకి అవతలివైపు ఖాతిర్ సోదరుడు ఉన్నారు. అతన్ని కలిసేందుకు వెళుతున్న సమయంలో వేగంగా వస్తున్న ఓ కారు వీరిని ఢీకొంది. గ్రాడ్యుయేషన్ సెర్మనీ నిర్వహణలో యూనివర్సిటీ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్టూడెంట్స్ విమర్శించారు. ఆన్లైన్ వేదికగా పలువురు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, యూనివర్సిటీపై ఆరోపణలు చేశారు. అయితే యూనివర్సిటీ ప్రతినిథులు, ప్రమాదం దురదృష్టకరమని, ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని వివరించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకుని, తీవ్రంగా గాయపడ్డ ఖాతిర్ని ఆసుపత్రికి తరలించింది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









